జింకలను వేటాడిన నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-09T22:24:55+05:30 IST

జింకలను వేటాడిన కేసులో ఇద్దరు నిందితులను నగర సౌత్‌జోన్

జింకలను వేటాడిన నిందితుల అరెస్ట్

హైదరాబాద్: జింకలను వేటాడిన కేసులో ఇద్దరు నిందితులను నగర సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు నిందితులు నిజామాబాద్‌ జిల్లాలో జింకలను వేటాడారు. వారి వద్ద నుంచి ఓ జింకతో పాటు జింక మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


నిజామాబాద్‌ జిల్లాలో ఓ జింకలను  వీరు వేటాడి చంపారు. ఈ  జింక మాంసంతో పాటు మరో జింకను రహస్యంగా హైద్రాబాద్‌కు తరలిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి వేటగాళ్లను అరెస్ట్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌లో కూడా జిల్లాలో వన్యప్రాణులను వేటాడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-03-09T22:24:55+05:30 IST