క్రికెట్ బెట్టింగ్ నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2020-09-24T06:49:09+05:30 IST
ఐపీఎల్ నేపధ్యంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 11మంది వ్యక్తులను బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు
సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 23: ఐపీఎల్ నేపధ్యంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 11మంది వ్యక్తులను బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లికి చెందిన నాగేశ్వరరావు అలియాస్ నాగిరెడ్డి అనే వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేసి విచారణ నిర్వహించగా అతడితో పాటు బెట్టింగులకు పాల్పడుతున్న మరో 10మందిని బుధవారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ.50వేల నగదు, 11సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతుందని, బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిలో మరికొందరు అరెస్ట్ కావాల్సి ఉందని ఏసీపీ తెలిపారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే ఎంతటివారినైనా అరెస్టు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, మద్యం తాగి వాహనం నడపడం నేరమన్నారు. కార్యక్రమంలో సీఐ ఏ.రమాకాంత్, ఎస్ఐ జీ.నరేష్ పాల్గొన్నారు.