ఐదుగురు మట్కాబీటర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-01-28T04:40:46+05:30 IST

స్థానిక ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధి పవర్‌హౌస్‌ రోడ్డులోని కరెంట్‌ ఆఫీసు వెనుక మట్కా జూదానికి పాల్పడుతున్న ఐదుగురు మట్కా బీటర్లను ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు.

ఐదుగురు మట్కాబీటర్ల అరెస్టు
పట్టుబడిన మట్కాబీటర్లు, నగదుతో ఎస్‌ఐ నాయక్‌, సిబ్బంది

రూ.42,150 నగదు, పట్టీలు స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 27: స్థానిక ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధి పవర్‌హౌస్‌ రోడ్డులోని కరెంట్‌ ఆఫీసు వెనుక మట్కా జూదానికి పాల్పడుతున్న ఐదుగురు మట్కా బీటర్లను ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ వివరాలను వెల్లడించారు. తమకు వచ్చిన సమాచారంతో తాను తన సిబ్బందితో కలిసి కరెంట్‌ ఆఫీసు వెనుక వెళ్లగా అక్కడ ఐదుగురు వ్యక్తులు మట్కా కార్యకలాపాలకు పాల్పడుతుండగా దాడి చేసి అరెస్టు చేశామన్నారు. వారిలో వెంకటరమణ, ఓబులేసు, ఆంజనేయులు, వెంకటపతి, లక్ష్మినారాయణలు ఉన్నారని, వీరి నుంచి రూ.42,150 నగదుతో పాటు పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరిని విచారించగా పెన్నానగర్‌కు చెందిన మహమ్మద్‌ గౌస్‌ అనే మట్కా నిర్వాహకుడికి మట్కాపట్టీలు ఇస్తామని తెలిపారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:40:46+05:30 IST