ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-09-17T02:57:46+05:30 IST
పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి
నల్గొండ: పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని బంగారుగడ్డలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసారు. ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేలు, 8 సెల్ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.