ప్రశ్నిస్తే అరెస్టులా?
ABN , First Publish Date - 2022-06-07T06:59:07+05:30 IST
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి, ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అధికార పార్టీ పనితీరును ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీకి 2వ వార్డు కౌన్సిలర్ చిర్రబోయిన హన్మంతు అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో మునిసిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
తిరుమలగిరి, జూన్ 6 : ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి, ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అధికార పార్టీ పనితీరును ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీకి 2వ వార్డు కౌన్సిలర్ చిర్రబోయిన హన్మంతు అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో మునిసిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనర్ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. ప్రభుత్వాని కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్తుండటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్ట్ చేసిన నాయకులను అర్వపల్లి పోలీ్సస్టేషన్కు తరలించారు. ధర్నాలో కౌన్సిలర్లు మొగుళ్ల జితేందర్, చిర్రబోయిన హన్మంతు, భాస్కర్, వంగాల డానియేల్, గంట బిక్షం రెడ్డి, సంకెపల్లి కొండల్ రెడ్డి, రవిందర్ రెడ్డి, దయాయాదవ్, దొంతరబోయిన నర్సింహ, కటుకూరి రమేష్, ఆకుల ఎల్లయ్య, కడెం మల్లయ్య, నరేష్, గణేష్, స్వామి పాల్గొన్నారు.