జామ్, చాక్లెట్లతో పెయింటింగ్!
ABN , First Publish Date - 2021-03-08T05:55:10+05:30 IST
బొమ్మలు వేయాలంటే మంచి రంగులు ఉపయోగిస్తాం. కానీ ఈజిప్టుకు చెందిన 25 ఏళ్ల మాగ్డీ మురాద్ మాత్రం చాక్లెట్లు, తేనె, జామ్తో అందమైన పెయింటింగ్లు వేస్తుంది..
బొమ్మలు వేయాలంటే మంచి రంగులు ఉపయోగిస్తాం. కానీ ఈజిప్టుకు చెందిన 25 ఏళ్ల మాగ్డీ మురాద్ మాత్రం చాక్లెట్లు, తేనె, జామ్తో అందమైన పెయింటింగ్లు వేస్తుంది.
- మురాద్ లాక్డౌన్ సమయంలో ఏం చేయాలో పాలుపోక కొత్త కొత్త ప్రయోగాలు చేసింది. మార్కెట్లో దొరికే రంగులు కాకుండా తనే కొన్ని ప్రత్యేకమైన రంగులతో బొమ్మలు వేసింది.
- తేనె, చాక్లెట్లు, జామ్, దానిమ్మ జ్యూస్... ఇలా రకరకాల పదార్థాలను రంగులుగా చేసుకుని బొమ్మలు వేసింది. ఆ బొమ్మలు చూసిన వారెవరైనా మార్కెట్లో దొరికే రంగులతో వేసినవే అనుకుంటారు.
- ఇంకా మురాద్ రంగుల జాబితాలో క్యాండీ, ఎండుద్రాక్ష, కోఫ్తా, ఈజిప్టియన్ కోషరి వంటివి కూడా ఉన్నాయి. ఇక బొమ్మలు వేయడానికి బ్రష్లకు బదులుగా టూత్పిక్లను ఉపయోగించింది.
- మురాద్ తండ్రి కూడా పెయింటర్. మురాద్లో ఉన్న టాలెంట్ను మొదట గుర్తించింది అతనే. స్కూల్లో జరిగిన పెయింటింగ్ పోటీల్లో అందమైన బొమ్మలు వేసి ఎన్నో బహుమతులు గెలుచుకుంది మురాద్.