టీమిండియా క్రికెటర్ల డైట్‌ విషయమై వస్తున్న వార్తలపై స్పందించిన బీసీసీఐ కోశాధికారి

ABN , First Publish Date - 2021-11-24T15:37:17+05:30 IST

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల డైట్ ప్లాన్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

టీమిండియా క్రికెటర్ల డైట్‌ విషయమై వస్తున్న వార్తలపై స్పందించిన బీసీసీఐ కోశాధికారి

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల డైట్ ప్లాన్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల డైట్‌లో ఇకపై బీఫ్, పోర్క్ ఉండబోదని, ఈ రెండింటినీ నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఆటగాళ్ల ఆహార విషయంలో నిబంధనలేంటని నెటిజన్లు, అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. అసలు ఆటగాళ్ల ఆహార విషయాల్లో బీసీసీఐ ఎలాంటి సలహాలూ ఇవ్వబోదని స్పష్టం చేశారు. కొత్త డైట్ ప్లాన్ అనేదే ఎన్నడూ చర్చకు రాలేదని అరుణ్ పేర్కొన్నారు. ఇక చర్చకే రానీ.. ఎటువంటి నిర్ణయమూ జరగనప్పుడు దాన్ని అమలు చేయడం కూడా సాధ్యపడదన్నారు. ఆటగాళ్ల ఆహార విషయంలో బీసీసీఐ ఎన్నడూ జోక్యం చేసుకోదని... అది వారి వారి వ్యక్తిగత అభిరుచుల మేరకే ఉంటుందని అరుణ్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-11-24T15:37:17+05:30 IST