కేజ్రీవాల్ చేతుల మీదుగా అహ్మదాబాద్లో పార్టీ కార్యాలయం
ABN , First Publish Date - 2021-06-14T01:01:20+05:30 IST
వచ్చే ఏడాది జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి ..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి సారించింది. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్లో 'ఆప్' కార్యాలయాన్ని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర యూనిట్ ఆహ్వానం మేరకు ఆయన సోమవారం అహ్మదాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. నవ్రంగ్పుర ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. కేజ్రీవాల్ గుజరాత్ పర్యటన ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇటీవల సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 'ఆప్' మంచి ఫలితాలు సాధించి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన నేపథ్యంలో గత ఫిబ్రవరిలో కేజ్రీవాల్ గుజరాత్ వెళ్లారు. 120 మంది సభ్యుల సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 27 సీట్లు గెలుచుకుంది.