తెలుగు నంది పురస్కార గ్రహీత ’ఆశాజ్యోతి’

ABN , First Publish Date - 2021-03-02T05:36:32+05:30 IST

పట్టణానికి చెందిన వి.ఆశాజ్యోతి ఫిలిం ఛాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ 24 క్రాప్ట్స్‌ సం యుక్త ఆధ్వర్యంలో తెలుగు నంది పురస్కారాన్ని అందుకున్నారు.

తెలుగు నంది పురస్కార గ్రహీత ’ఆశాజ్యోతి’

తణుకు, మార్చి 1 : పట్టణానికి చెందిన వి.ఆశాజ్యోతి ఫిలిం ఛాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ 24 క్రాప్ట్స్‌ సం యుక్త ఆధ్వర్యంలో తెలుగు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతీ ఏటా జాతీయ స్థాయిలో  వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి తెలు గు నంది పురస్కారం అందజేస్తా రు. విజయవాడ డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు కళా మందిరంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ హెల్త్‌ విజిటర్‌గా పనిచేస్తున్న ఆశాజ్యోతికి ఏపీ ప్రభుత్వ సాహితీ అకాడమీ మాజీ సభ్యుడు డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌, ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి కోన సురేష్‌కుమార్‌, టీటీడీ సభ్యుడు బెజ్జంకి అనిల్‌కుమార్‌, వేదిక సొసైటీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఆరవల్లి నరేంద్ర పురస్కారం అందజేసి సత్కరించారు. 

Updated Date - 2021-03-02T05:36:32+05:30 IST