ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చింది: అశోక్గజపతిరాజు
ABN , First Publish Date - 2021-04-03T01:54:54+05:30 IST
ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చింది: అశోక్గజపతిరాజు
అమరావతి: పరిషత్ ఎన్నికలపై స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమని అధిష్టానం చెప్పిందని టీడీపీ నేత అశోక్గజపతిరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదికిపైగా ఎన్నికలు కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. అయినా ఆగిన చోట నుంచే ఎన్నికలు కొనసాగిస్తున్నారని తప్పుబట్టారు. బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని అశోక్గజపతిరాజు పేర్కొన్నారు.