వైసీపీ ప్రభుత్వంపై అశోక్ గజపతిరాజు ఫైర్
ABN , First Publish Date - 2021-01-16T21:11:24+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు.
విజయనగరం: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రామతీర్థం ఘటన దురదృష్టకరమన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా.. అనువంశిక చైర్మన్ పదవి నుంచి తొలగించడం అన్యాయమన్నారు. చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు లేవన్నారు. అంతర్వేది, దుర్గగుడి ఘటనలో చైర్మన్, ఈవోలపై.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కొత్త విగ్రహాల ఏర్పాటు కోసం డొనేషన్ ఇచ్చా.. ఇచ్చిన విరాళాలను వెనక్కి ఇవ్వడం సరికాదని అశోక్గజపతిరాజు పేర్కొన్నారు.