ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మం: Ashok gajapati
ABN , First Publish Date - 2021-10-18T14:24:29+05:30 IST
పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు.
విజయనగరం: పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం సందర్భంగా అమ్మవారికి దేవస్ధాన అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ఉందని, జాగ్రత్తలు పాటించాలని... కరోనాకు మతాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మమని తెలిపారు. అన్ని మతాల వారు మిగతా మతాల పండగలకు సహకరించాలన్నారు. ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందే అది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అన్నది ఒకొక్క దగ్గర ఒకలా అమలు చేస్తున్నారని అన్నారు. 300 రూపాయిల టిక్కెట్లు పెట్టారని టీడీపీపై పెడ్టడం సరికాదన్నారు. రాజకీయ పార్టీలు దేవస్థానాల టిక్కెట్లు రేట్లు ఎలా నిర్ణయిస్తారని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు.