సీఎల్పీ భేటీకి వెళ్లరాదని సచిన్ పైలట్ నిర్ణయం
ABN , First Publish Date - 2020-07-14T04:48:39+05:30 IST
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో మంగళవారం ఉదయం పదిగంటలకు జరగనున్న సీఎల్పి సమావేశానికి హాజరుకారాదని సచిన్ పైలట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో మంగళవారం ఉదయం పదిగంటలకు జరగనున్న సీఎల్పి సమావేశానికి హాజరుకారాదని సచిన్ పైలట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సమావేశానికి రావాలంటూ ఇప్పటికే డిప్యూటీ సీఎం సచిన్ పైలట్కు ఆహ్వానం పంపారు. అయితే సమావేశానికి వెళ్లరాదని నిర్ణయించుకోవడంతో అధిష్టానం ఆయన్ను బుజ్జగించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పైలట్తో మాట్లాడారు. అయితే ఆయన వెనక్కు తగ్గడం లేదని సమాచారం. అహ్మద్ పటేల్, చిదంబరం వంటి సీనియర్లతో పాటు అభిషేక్ సింఘ్వీ కూడా రంగంలోకి దిగారు. బెట్టు వీడాలని, ఇబ్బందులపై చర్చించాలని సూచించారు. పైలట్ ఇబ్బందులను వినేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
మరోవైపు ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశానికి 107 మంది ఎమ్మెల్యేలకు గానూ 84 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బస్సుల్లో హోటల్కు తరలించారు. 200 మంది సభ్యులున్న రాజ్యసభ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 101. తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని సచిన్ ప్రకటించిన నేపథ్యంలో గెహ్లాట్ సర్కారు గట్టెక్కాలంటే ఆయన మద్దతు తప్పనిసరిగా మారింది.