యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు: అశోక్గజపతిరాజు
ABN , First Publish Date - 2022-01-24T09:03:28+05:30 IST
రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు విమర్శించారు.
విజయనగరం రూరల్, జనవరి 23: రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదివారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా ప్రభుత్వాలు చూశానని, ఈ ప్రభుత్వంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘనలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. దీనిపై యువత పోరాడాలని సూచించారు.