2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రియాంక దృష్టి

ABN , First Publish Date - 2020-07-02T15:42:57+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి సారించనున్నారా ? అంటే అవునంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ....

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రియాంక దృష్టి

ఢిల్లీ నుంచి లక్నోలోని కౌల్ హౌస్‌కు మారనున్న ప్రియాంకగాంధీ

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టి సారించనున్నారా ? అంటే అవునంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు...న్యూఢిల్లీ లోధి ఎస్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాను నెలరోజుల్లోగా ఖాళీ చేయాలని కేంద్ర భవనాలు, పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రియాంకా వాద్రా తన మకాంను యూపీ లక్నో నగరానికి మకాం మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందిరాగాంధీ సమీపబంధువు అయిన కేంద్ర మాజీ మంత్రి  షీలాకౌల్ లక్నోలో ఓ భవనముంది. కౌల్ హౌస్ బంగళాను ప్రియాంక నివాసముండేందుకు దాన్ని తాజాగా మరమ్మతులు చేయించారని లక్నో కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా తాను ఢిల్లీ నుంచి లక్నోకు మకాం మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇందిరాగాంధీ కూడా తన భర్త ఫిరోజ్ గాంధీతో కలిసి లక్నోలోని ఏపీసేన్ రోడ్డులో నివాసమున్నారు. ప్రియాంకగాంధీ లక్నోకు మకాం మారిస్తే కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేసి ఎన్నికలకు సమాయత్తపర్చేందుకు వీలవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. 

Updated Date - 2020-07-02T15:42:57+05:30 IST