ఎన్నికలు, కొవిడ్‌ నిబంధనల మేరకే కౌంటింగ్‌

ABN , First Publish Date - 2021-09-18T03:51:44+05:30 IST

జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఎన్నికలు, కొవిడ్‌ నిబంధనలు మేరకు చేపడుతున్నట్లు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు.

ఎన్నికలు, కొవిడ్‌ నిబంధనల మేరకే కౌంటింగ్‌
కావలిలో కౌంటింగ్‌ ఏర్పాట్ల పై పోలీసులకు సూచనలిస్తున్న ఏఎస్పీ వెంకటరత్నం

ఏఎస్పీ వెంకటరత్నం

కావలి, సెప్టెంబరు 17: జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఎన్నికలు, కొవిడ్‌ నిబంధనలు మేరకు చేపడుతున్నట్లు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు. కావలి విశ్వోదయ ఇంజనీరింగ్‌ కళాశాలలో కావలి రూరల్‌, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ జరుగనుండటంతో ఆ కేంద్రాలను శుక్రవారం స్థానిక పోలీస్‌ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అలాగే కావలి ఆర్డీవో శీనా నాయక్‌ కూడా కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ వెంకటరత్నం కౌంటింగ్‌ ఏర్పాట్లపై  స్థానిక పోలీస్‌ అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కావలి ఏఎస్పీ డీ. ప్రసాద్‌రావు, సీఐలు శ్రీనివాసరావు, మల్లికార్జున, అక్కేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-09-18T03:51:44+05:30 IST