ఎన్నికలు, కొవిడ్ నిబంధనల మేరకే కౌంటింగ్
ABN , First Publish Date - 2021-09-18T03:51:44+05:30 IST
జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఎన్నికలు, కొవిడ్ నిబంధనలు మేరకు చేపడుతున్నట్లు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు.
ఏఎస్పీ వెంకటరత్నం
కావలి, సెప్టెంబరు 17: జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఎన్నికలు, కొవిడ్ నిబంధనలు మేరకు చేపడుతున్నట్లు ఏఎస్పీ వెంకటరత్నం తెలిపారు. కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో కావలి రూరల్, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగనుండటంతో ఆ కేంద్రాలను శుక్రవారం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అలాగే కావలి ఆర్డీవో శీనా నాయక్ కూడా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ వెంకటరత్నం కౌంటింగ్ ఏర్పాట్లపై స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కావలి ఏఎస్పీ డీ. ప్రసాద్రావు, సీఐలు శ్రీనివాసరావు, మల్లికార్జున, అక్కేశ్వరరావు తదితరులు ఉన్నారు.