హార్వెస్టర్‌కు దుండగుల నిప్పు

ABN , First Publish Date - 2022-07-26T05:29:57+05:30 IST

ధరూరు మండలంలోని నీలహల్లి గ్రామంలో సోమవారు తెల్లవారుజామున బోయ హనుమంతు పొలం వద్ద ఉన్న హార్వెస్టర్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు.

హార్వెస్టర్‌కు దుండగుల నిప్పు
నీలహల్లి గ్రామంలో నిప్పంటుకున్న హార్వెస్టర్‌

- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే  

- రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వెల్లడి 

ధరూరు, జూలై 25 :  ధరూరు మండలంలోని నీలహల్లి గ్రామంలో సోమవారు తెల్లవారుజామున బోయ హనుమంతు పొలం వద్ద ఉన్న హార్వెస్టర్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అం దుకున్న ధరూరు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, కేటీదొడ్డి ఎస్‌ఐ కురుమయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేవవరు. గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌ రెడ్డి హార్వెస్టర్‌ను పరిశీలించి, బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దుండగులు ఎంతటి వారైనా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.  ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్‌, ఎంపీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, నాయకులు జాకీర్‌, జంబు రామన్‌గౌడ్‌ ఉన్నారు.  

Updated Date - 2022-07-26T05:29:57+05:30 IST