మిజోరం వెళ్లకండి: అస్సాం బహిరంగ ప్రకటన

ABN , First Publish Date - 2021-07-30T05:40:02+05:30 IST

రాష్ట్ర ప్రజలకు అస్సాం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కనున్న ..

మిజోరం వెళ్లకండి: అస్సాం బహిరంగ ప్రకటన

దిస్‌పుర్: రాష్ట్ర ప్రజలకు అస్సాం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కనున్న మిజోరం రాష్ట్రానికి విహారయాత్రలకు వెళ్లవద్దని సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును మించింది లేదని, దానికి విఘాతం కలిగించే ఏ పరిస్థితినీ అంగీకరించేది లేదని ఆ ప్రకటనలో అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు వెనువెంటనే అమలులోకి వస్తాయని తెలిపింది. అలాగే ఎవరైనా ఉద్యోగరీత్యా అస్సాంలో నివశిస్తుంటే వారు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.



Updated Date - 2021-07-30T05:40:02+05:30 IST