163 కోట్ల డ్రగ్స్ను స్వయంగా తగలబెట్టిన సీఎం
ABN , First Publish Date - 2021-07-18T23:02:05+05:30 IST
ముఖ్యమంత్రి హిమంతవిశ్వ శర్మ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకాన్ని
గౌహతి : ముఖ్యమంత్రి హిమంతవిశ్వ శర్మ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకాన్ని అనుమతించమని, డ్రగ్స్ వాడకాన్ని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ దాదాపు 163 కోట్ల విలువ చేసే డ్రగ్స్పై బుల్డోజర్ ఎక్కించి, తొక్కించిన సీఎం, స్వయంగా ఆ డ్రగ్స్ను తగలబెట్టారు. డ్రగ్స్ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, దీని ద్వారా కుటుంబాలు సర్వనాశనంఅవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వాడకం అనేక సామాజిక రుగ్మతలకు దారి తీస్తోందని, అందుకే డ్రగ్స్ వాడకంపై తాము కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలోనే మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించాలని తాము నిర్ణయించామని, ఇందులో భాగంగా వారికి పునరావాసం కల్పించే విషయంలో పూర్తి నిబద్ధతతో ఉంటామని హేమంతవిశ్వ శర్మ పేర్కొన్నారు.