ఆర్ఎస్ఎస్ చీఫ్తో అసోం సీఎం భేటీ
ABN , First Publish Date - 2021-06-12T00:50:16+05:30 IST
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇవాళ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో సమావేశం అయ్యారు...
నాగ్పూర్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇవాళ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో సమావేశం అయ్యారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద వీరి భేటీ జరిగింది. నెల రోజుల క్రితం అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శర్మ.. సీఎం హోదాలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో శర్మ దాదాపు గంటసేపు గడిపారని సంఘ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఇరువురి సమావేశంలో ఏమేం చర్చించారన్నది మాత్రం బయటికి రాలేదు.