అస్సాంలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-28T21:29:52+05:30 IST

అస్సాంలో పెరిగిన కరోనా కేసులు

అస్సాంలో పెరిగిన కరోనా కేసులు

డిస్ పూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ అస్సాంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గురువారం మధ్యాహ్నానికి అందిన సమాచారం మేరకు కొత్తగా అస్సాం రాష్ట్రంలో 33 కోవిడ్-19  పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 831 కరోనా కేసులు నమోదవగా.. కరోనా నుంచి కోలుకొని 87 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 737 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య శాఖ తెలిపింది.

Updated Date - 2020-05-28T21:29:52+05:30 IST