అసోంలో వెల్లువెత్తిన వరదలు..సురక్షిత ప్రాంతాలకు వన్యప్రాణుల తరలింపు

ABN , First Publish Date - 2020-07-01T16:27:22+05:30 IST

అసోంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల నదులు ఉప్పొంగి వరదలు వెల్లువెత్తడంతో జాతీయ వనాల్లోని వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. ....

అసోంలో వెల్లువెత్తిన వరదలు..సురక్షిత ప్రాంతాలకు వన్యప్రాణుల తరలింపు

గువాహటి (అసోం): అసోంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల నదులు ఉప్పొంగి వరదలు వెల్లువెత్తడంతో జాతీయ వనాల్లోని వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. అసోంలోని కజిరంగా, మనాస్, పొబితొర అభయారణ్యాల్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో జాతీయ వనాల్లోని వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదబారిన పడిన వన్యప్రాణులను 183 వన్యప్రాణుల శిబిరాలకు తరలించామని అసోం రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల సంస్థ అధికారి పంకజ్ చక్రవర్తి చెప్పారు. అసోంలోని 23 జిల్లాల్లో వరదనీరు ప్రవహిస్తుండటంతో 27 మంది మరణించారు. బార్పేట, దిబ్రూఘడ్ ప్రాంతాల్లో ఇద్దరు వరదనీటిలో మునిగి మరణించారు. 15 లక్షలమంది వరద బారిన పడ్డారు. 25,461 మంది వరద బాధితులను 265  సహాయ శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు.టిన్ సుకియా, గుజ్జాన్ ప్రాంతాల్లోని గ్రామాల్లో వరదనీరు పోటెత్తడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Updated Date - 2020-07-01T16:27:22+05:30 IST