అసోంలో వెల్లువెత్తిన వరదలు...ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-05-28T12:30:51+05:30 IST

అసోం రాష్ట్రంలో సంభవించిన వరదల్లో ఒకరు మరణించారు.....

అసోంలో వెల్లువెత్తిన వరదలు...ఒకరి మృతి

గువహటి (అసోం): అసోం రాష్ట్రంలో సంభవించిన వరదల్లో ఒకరు మరణించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన వరదల్లో నదులు పొంగి ప్రవహిస్తుండటంతో 11 జిల్లాల్లోని 2.71 లక్షల మంది వరదల బారిన పడ్డారు.ముంపు ప్రాంతాల్లోని 16,700 మంది వరద బాధితులను సహాయపునరావాస కేంద్రాలకు తరలించారు. కామ్ రూప్ జిల్లాలోని రోంగియా వద్ద వరదనీటిలో మునిగి ఒకరు మరణించారని అసోం రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల సంస్థ అధికారులు చెప్పారు. థీమాజీ, లఖింపూర్, నాగాం, హోజోయ్, దారంగ్, బార్పేట, నల్బరి, గోల్పార, వెస్ట్ కర్బీఅంగ్ లాంగ్, దిబ్రూగడ్, తిన్ సుకియా జిల్లాల్లోని 21 రెవెన్యూ సర్కిళ్లలో 321 గ్రామాలు వరదనీటిలో మునిగాయి. గోపాల్ పర, నల్బరీ జిల్లాలో 22,332 మందిని సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు. 57 సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మపుత్ర, పూతిమరి నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తూ ప్రమాదస్థాయికి చేరుకున్నాయని అధికారులు చెప్పారు. 2,678 హెక్టార్లలో పంటలు మునిగిపోయాయి. 28,300 జంతువులు, 9,350 కోళ్లు వరదనీటిలో మునిగాయి. వరదల బారిన పడిన జంతువులకు సురక్షితప్రాంతాలకు తరలించి పశుగ్రాసం అందించాలని సీఎం ఆదేశించారు. వరదల వల్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2020-05-28T12:30:51+05:30 IST