అస్సాం, నాగాలాండ్ గవర్నర్‌కు కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-14T00:28:45+05:30 IST

అస్సాం, నాగాలాండ్ గవర్నర్‌కు కోవిడ్ పాజిటివ్

అస్సాం, నాగాలాండ్ గవర్నర్‌కు కోవిడ్ పాజిటివ్

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజువారీగా లక్షల్లోనే నమోదవుతున్నాయి. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అస్సాం, నాగాలాండ్ గవర్నర్ జగదీష్ ముఖికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పరీక్షల్లో గవర్నర్ జగదీష్ ముఖికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యాఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు గత సాయంత్రం గౌహతిలో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గవర్నర్ భార్యకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పరీక్షల్లో ఆమెకు కోవిడ్ నెగటివ్ గా వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్ భార్య రాజ్‌భవన్‌లో ఉన్నారు.


Updated Date - 2022-01-14T00:28:45+05:30 IST