రామ మందిర నిర్మాణానికి సహకరించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:26:38+05:30 IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరి ంచాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంబిడి ప్రకాష్‌రెడ్డి, దేవరకొండ ఇన్‌చార్జి కళ్యాణ్‌నాయక్‌, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత్‌ లాలునాయక్‌ కోరారు.

రామ మందిర నిర్మాణానికి సహకరించాలి

చింతపల్లి, జనవరి 15: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరి ంచాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంబిడి ప్రకాష్‌రెడ్డి, దేవరకొండ ఇన్‌చార్జి కళ్యాణ్‌నాయక్‌, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత్‌ లాలునాయక్‌ కోరారు. వీటీనగర్‌ నుంచి చింతపల్లికి శుక్రవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం అదృష్టమన్నారు. ప్రతిఒకరూ నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ జిల్లా ప్రతినిధి సైదులు, నాయకులు శివర్ల రమేష్‌ యాదవ్‌, అనిల్‌రెడ్డి, అండేకార్‌ వెంకటేష్‌, గుర్రం వెంకటరమణ, సర్పంచ్‌లు బొడ్డు శ్రీను, కాసోజు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T05:26:38+05:30 IST