అంత్యక్రియలకు యువతరం సేవా సమితి సాయం
ABN , First Publish Date - 2021-12-07T06:39:00+05:30 IST
పేద వ్యక్తి మృతదేహానికి యువతరం సేవాసమితి సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి, డిసెంబరు 6: ఆర్థిక ఇబ్బందులతో ఓ పేద వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేమని బంధువులు తేల్చిచెప్పడంతో, యువతరం సేవాసమితి సభ్యులు సాయం చేశారు. వివరాలివీ.. శ్రీకాళహస్తికి చెందిన రమేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు సమీప బంధువులున్నా ఒంటరిగానే జీవిస్తున్నాడు. కాగా, ఆదివారం ఆయన మృతిచెందడంతో ఆ సమాచారాన్ని వన్టౌన్ కానిస్టేబుల్ మునస్వామి రమేష్ బంధువులకు వివరించారు. వారు ఆర్థిక పరిస్థితులతో ముందుకు రాకపోవడంతో, యువతరం సేవాసమితి సభ్యులు చొరవ చూపి రమేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.