అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీలతకు పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2020-06-02T09:19:53+05:30 IST

కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట రాజీవ్‌గాంధీ న్యాయ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వేగుంట శ్రీలతకు ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రదానం చేసింది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీలతకు పీహెచ్‌డీ

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 1: కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట రాజీవ్‌గాంధీ న్యాయ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వేగుంట శ్రీలతకు ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రదానం చేసింది. సమాచార హక్కు చట్టం-2015, తూర్పు గోదావరి జిల్లాలో ఈ చట్టం అమలు జరుగుతున్న తీరు అంశాలపై ఆమె సమర్పించిన పరిశోధనా సిద్ధాంత గ్రంథానికి పీహెచ్‌డీ మంజూరు చేసింది. శ్రీలత పరిశోధనకు ఏయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కొనాల సీతామాణిక్యం మార్గదర్శకం చేశారు. శ్రీలతను తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ ఓలేటి వెంకట భాస్కరశర్మ, డాక్టర్‌ కామేపల్లి చంద్రశేఖరం, డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి అభినందించారు.

Updated Date - 2020-06-02T09:19:53+05:30 IST