బాధిత కుటుంబానికి భరోసా

ABN , First Publish Date - 2021-06-18T04:45:24+05:30 IST

మండలంలోని రామాపురం గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనా రోగ్యంతో మృతి చెందిన తెలుగు బాలయ్య కుటుంబానికి పూర్వ విద్యార్థులు రూ. 45వేలు ఆర్థిక సాయం అందించారు.

బాధిత కుటుంబానికి భరోసా
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు


పెంట్లవెల్లి, జూన్‌ 17:మండలంలోని రామాపురం గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనా రోగ్యంతో మృతి చెందిన తెలుగు బాలయ్య కుటుంబానికి  పూర్వ విద్యార్థులు రూ. 45వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలయ్య పిల్లల చదు వు బాధ్యత మేమే చూసుకుంటామని వారి  భరోసానిచ్చారు.  కార్యక్రమంలో పూర్వ విద్యా ర్థులు రామస్వామి, లింగం, భాస్కర్‌, రఘుపతి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

కోడేరులో..

కోడేరు, జూన్‌ 17:మండల కేంద్రానికి చెందిన బుడ్డమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. ఆమె కుటుంబానికి 50కేజీల బియ్యాన్ని గురువారం  దూరెడ్డి రఘువ ర్ధన్‌ రెడ్డి అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీశైలం, యూత్‌ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి, మధు, లాలు ఉన్నారు. 



 

Updated Date - 2021-06-18T04:45:24+05:30 IST