బాధిత కుటుంబానికి భరోసా
ABN , First Publish Date - 2021-06-18T04:45:24+05:30 IST
మండలంలోని రామాపురం గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనా రోగ్యంతో మృతి చెందిన తెలుగు బాలయ్య కుటుంబానికి పూర్వ విద్యార్థులు రూ. 45వేలు ఆర్థిక సాయం అందించారు.
పెంట్లవెల్లి, జూన్ 17:మండలంలోని రామాపురం గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనా రోగ్యంతో మృతి చెందిన తెలుగు బాలయ్య కుటుంబానికి పూర్వ విద్యార్థులు రూ. 45వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలయ్య పిల్లల చదు వు బాధ్యత మేమే చూసుకుంటామని వారి భరోసానిచ్చారు. కార్యక్రమంలో పూర్వ విద్యా ర్థులు రామస్వామి, లింగం, భాస్కర్, రఘుపతి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కోడేరులో..
కోడేరు, జూన్ 17:మండల కేంద్రానికి చెందిన బుడ్డమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. ఆమె కుటుంబానికి 50కేజీల బియ్యాన్ని గురువారం దూరెడ్డి రఘువ ర్ధన్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీశైలం, యూత్ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, మధు, లాలు ఉన్నారు.