Mexicoలో ఘోర రోడ్డు ప్రమాదం..49 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-10T12:41:51+05:30 IST
మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 49 మంది వలసదారులు మరణించారు...
టక్స్లా గుటిరెజ్: మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 49 మంది వలసదారులు మరణించారు. వలసకార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కు రిటైనింగ్ గోడను ఢీకొని చియాపాస్లో బోల్తా పడిందని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.ఈ దుర్ఘటనలో మరో 40 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాసిక్యూటర్ల ప్రాథమిక నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న అక్రమ వలసదారులకు గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్ ప్రధాన రవాణా కేంద్రంగా మారింది.రాష్ట్ర రాజధాని టక్స్ట్లా గుటిరెజ్తో కలిపే హైవేపై వస్తుండగా ట్రక్కు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది.మృతులు ఏ దేశ జాతీయులు అనేది వెంటనే తెలియరాలేదు.మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసహాయం అందించాలని ఆదేశించినట్లు రుటిలియో ట్విట్టర్లో పేర్కొన్నారు.ఈ ఘోర ప్రమాదానికి ఎవరు కారణమనేది చట్టం నిర్ణయిస్తుందని, దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని రుటిలియో చెప్పారు.