Ukraineపై రష్యా క్షిపణి దాడిలో 10 మంది మృతి
ABN , First Publish Date - 2022-07-01T12:56:24+05:30 IST
ఉక్రెయిన్ దేశంలోని ఒడెసాలోని ఓడరేవులో శుక్రవారం తెల్లవారుజామున రష్యా క్షిపణితో దాడి చేసింది...
కైవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలోని ఒడెసాలోని ఓడరేవులో శుక్రవారం తెల్లవారుజామున రష్యా క్షిపణితో దాడి చేసింది.రష్యా క్షిపణి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనంపై చేసిన దాడిలో 10 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.బహుళ అంతస్థుల అపార్టుమెంటు భవనంపై క్షిపణి దాడి ఫలితంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 10కి పెరిగిందని ఒడెసా ప్రాంతీయ పరిపాలన ప్రతినిధి సెర్హి బ్రాట్చుక్ తెలిపారు.శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మరణించారని అంతకుముందు నివేదికలు తెలిపాయి.