పెరూ దేశంలో బస్సు ప్రమాదం...20మంది దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-13T13:01:45+05:30 IST
పెరూ దేశంలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించారు....
లిమా (పెరూ): పెరూ దేశంలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు మరణించారు. పెరూ దేశంలోని సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. పెరూ దేశ సాధారణ ఎన్నికల్లో ఓటు వేసి బస్సులో వస్తుండగా ప్రయాణికులు ప్రమాదం బారిన పడ్డారు.పెరూ దేశ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు.ఈ బస్సు ప్రమాదంపై పెరూ రవాణ సంస్థ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.