రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు
ABN , First Publish Date - 2021-12-02T05:30:00+05:30 IST
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారని రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ బాయ్, సెక్రెటరీ విఠల్నాయక్, కోచ్ జైపాల్ గురువారం తెలిపారు.
నారాయణఖేడ్, డిసెంబరు 2: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారని రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ బాయ్, సెక్రెటరీ విఠల్నాయక్, కోచ్ జైపాల్ గురువారం తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో 37 మంది పాల్గొన్నట్టు తెలిపారు. వీరిలో ఫ్రీస్టైల్ విభాగానికి సంబంధించి రాంశెట్టి (52కిలోల విభాగం), సలోమి(46 కిలోలు), గ్రీకురోమన్ స్టైల్ శివకుమార్(57కిలోలు) స్వర్ణ పతకాలు సాఽఽధించారని వివరించారు. శ్రీకాంత్ (38 కిలోల విభాగంలో) రజత పతకం, విలాస్ నాయక్ (85 కిలోలు), రాము (38కిలోలు), వైష్ణవి (39కిలోలు) కాంస్య పతకాలు సాఽధించినట్లు తెలిపారు. కాగా పతకాలు సాఽధించిన క్రీడాకారులు ఈ నెల 11న జార్ఖండ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు చెప్పారు. రెజ్లింగ్లో సత్తా చాటిన క్రీడాకారులను వారు అభినందించారు.