వంద కొడితే.. రూ.500 నోటు.. క్యూ కట్టిన జనం
ABN , First Publish Date - 2021-05-15T21:57:15+05:30 IST
జిల్లాలోని అమరచింతలో ఉన్న ఓ ఏటీఎంలో శనివారం వింత చోటు చేసుకుంది. ఇండియా నెం.1 ఏటీయంలో...
వనపర్తి: జిల్లాలోని అమరచింతలో ఉన్న ఓ ఏటీఎంలో శనివారం వింత చోటు చేసుకుంది. ఇండియా నెం.1 ఏటీయంలో... రూ. 100లకు బదులు ఏకంగా రూ.500 డ్రా అయ్యాయి. అలా చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. అయితే పోలీసులు పెట్రోలింగ్కు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే సంబంధిత ఏటీయం అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఏటీయంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేశారు.