ఏటీఎం ధ్వంసం : రూ.3.91 లక్షల దోపిడీ

ABN , First Publish Date - 2021-09-18T15:30:21+05:30 IST

రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం పెరుంగళత్తూర్‌లో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన ఎటీఎంలో గుర్తు తెలియని వ్యక్తు లు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏటీఎం మెషీన్‌లో గురువారం ఉదయం రూ.8 ల

ఏటీఎం ధ్వంసం : రూ.3.91 లక్షల దోపిడీ

వేలూరు(చెన్నై): రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం పెరుంగళత్తూర్‌లో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన ఎటీఎంలో గుర్తు తెలియని వ్యక్తు లు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏటీఎం మెషీన్‌లో గురువారం ఉదయం రూ.8 లక్షలు బ్యాంక్‌ అధికారులు నింపారు. అర్ధరాత్రి ఏటీఎం కేంద్రంలోని ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు వెల్డింగ్‌ మెషీన్‌ సాయంతో యంత్రాన్ని ధ్వంసం చేసి రూ.3.91 లక్షలు దోపిడీ చేసి పరారయ్యారు. ఈ ఘటనపై బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-09-18T15:30:21+05:30 IST