ఏటీఎంలో 6.50లక్షలు దోచుకున్న నిందితుడు దొరికాడు!
ABN , First Publish Date - 2021-06-07T11:47:55+05:30 IST
నల్లగండ్లలోని అపర్ణ జెనిత్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్
హైదరాబాద్/చందానగర్ : నల్లగండ్లలోని అపర్ణ జెనిత్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఏటీఎం నుంచి రూ.6.50లక్షలు దోచుకున్న నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హుడా లేవుట్లో ఏటీఎం మిషన్ను పగలగొడుతుండగా చందానగర్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు నల్లగండ్ల ప్రాంతంలో నివాసముంటున్న ఎలక్ర్టీషన్ రాజుగా అతన్ని గుర్తించారు. అతని వద్ద చోరీకి గురైన మొత్తం రూ.6.50లక్షలు రికవరీ చేశారు. చోరీకి ఉపయోగించిన స్ర్కూ డ్రైవర్తోపాటు పలు పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజుపై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. గంటలోపు కేసును ఛేదించిన చందానగర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.