భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-27T05:58:40+05:30 IST

భార్య కాపురానికి రావటంలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నిడుముక్కలలో మంగళవారం చోటు చేసుకుంది.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

తాడికొండ, జనవరి 26: భార్య కాపురానికి రావటంలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నిడుముక్కలలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన మేరుగ మరియదాసు(50)కు తాడికొండ మండలం నిడుముక్కలకు చెందిన నాగమణితో 30  ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆర్థిక సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. ఇద్దరు గుంటూరులో వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే భార్యను కాపురానికి రావాలని అడుగగా రాలేదు. ఈ క్రమంలో  ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గ్రంధి వెంకటాద్రి తెలిపారు.

Updated Date - 2021-01-27T05:58:40+05:30 IST