లక్ష దాటేశాయ్..!
ABN , First Publish Date - 2021-05-12T07:30:51+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లక్షను అధిగమించాయి.
కరోనా కేసులు 101408
మరణాలు 737
ఏప్రిల్ నుంచే వైరస్ విలయం...
కేసులు పైపైకి..
41 రోజుల్లోనే 32925 కేసులు...
134 మంది బలి..
కొత్తగా 1992 మందికి పాజిటివ్
మరో ఐదుగురు మృతి
అనంతపురం వైద్యం, మే 11: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లక్షను అధిగమించాయి. గత మార్చి వరకు కేసులు 70 వేలలోపే ఉండేవి. ఏప్రిల్ నుంచి వైరస్ జిల్లాలో పంజా విసురుతోం ది. ఈ క్రమంలో ఒక్కసారిగా కే సు లు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. 41 రోజుల్లోనే జిల్లాలో 32925 కరోనా కేసులు నమోదయ్యాయి. 134 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో జిల్లాలో కరోనా కేసులు 101408కు చేరిపోయాయి. కేసులు లక్ష దాట గా, కరోనా మరణాలు 737కు చేరిపోయాయి. మంగళవారం గడిచిన 24 గంటల్లో 1992 మందికి పాజిటివ్ వ చ్చింది. కరోనాతో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 86143 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 14528 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త పాజిటివ్ కేసులు ఇలా..
జిల్లాలో గడిచిన ఒక్కరోజులో 5174 శాంపిల్స్ పరీక్షలు చేశా రు. ఇందులో 1992 మంది కరోనా బారిన పడ్డారు. అందులో అనంతపురం 443, హిందూపురం 154, రొద్దం 74, గుంతకల్లు 73, కదిరి 65, ధర్మవరం, రాయదుర్గం 56, మడకశిర 55, తాడిపత్రి 50, సోమందేపల్లి 49, పెనుకొండ 42, పరిగి 39, పెద్దవడగూరు 35, బత్తలపల్లి, నంబులపూలకుంట, కళ్యాణదుర్గం 32, అమరాపురం 30, కొత్తచెరువు 29, కంబదూరు 28, ఉరవకొండ, బ్రహ్మసముద్రం 26, గుడిబండ 25, గుత్తి 23, కూడేరు 22, కణేకల్లు 21, తలుపుల, వజ్రకరూరు, నార్పల 19, చెన్నేకొత్తపల్లి 16, బెళుగుప్ప, కుందుర్పి 15, బుక్కరాయసముద్రం, పామిడి 14, తాడిమర్రి 13, ఆత్మకూరు, చిలమత్తూరు, అమడగూరు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట 12, నల్లమాడ, పుట్లూరు, రాప్తాడు, శింగనమల, యల్లనూరు, డీ హీరేహాళ్, లేపాక్షి 11, బుక్కపట్నం, గార్లదిన్నె, రామగిరి 10, ముదిగుబ్బ, ఓబుళదేవరచెరువు 8, కనగానపల్లి, నల్లచెరువు 6, అగళి, పెద్దపప్పూరు 5, తనకల్లు, యాడికి 4, విడపనకల్లు 3, గాండ్లపెంట 2, రొళ్ల ఒకటి చొప్పున కొత్తగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.