నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించాలి
ABN , First Publish Date - 2021-05-12T07:26:48+05:30 IST
కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో నోడల్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ప్రజలను కాపాడాలని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.
ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం ప్రెస్క్లబ్, మే 11: కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో నోడల్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ప్రజలను కాపాడాలని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏడీసీసీ బ్యాంకులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో ఎంపీ రంగయ్యతో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. టెక్నికల్ అంశాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విపత్తు సమయంలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత నోడల్ ఆఫీసర్ల మీదే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ప్రతిరోజూ ఉదయం ఆస్పత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించుకొని ఆ రోజు వి ధులను వివరించాలన్నారు. ఎప్పటికప్పుడు కరోనా గురించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిబంధనలపై అవగాహన క ల్పించాలన్నారు. ప్రతి ఐదు గంటలకోసారి ఆస్పత్రులను సం దర్శించి, సిబ్బంది విధులను సమీక్షించాలన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సర్వజన, సూపర్ స్పెషాలి టీ, క్యాన్సర్ ఆస్పత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకునేందుకు అవసరమైన కూలీలను ని రంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారికి వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ను ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర నుంచి అవసరమైనపుడు తెచ్చుకునేందుకు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. జీజీహెచ్, సూపర్స్పెషా లిటీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లన్నీ ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ వృథాను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మానిటరింగ్ బృందాలు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తిని ఆదేశించారు. ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితుల సహాయకులు ఎక్కువగా ఉంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. సహాయకుల సంఖ్య నియంత్రించాలని ఆదేశించారు. ఎంపీ రంగ య్య మాట్లాడుతూ కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు నోడల్ అధికారులు, ఆస్పత్రుల సూ పరింటెండెంట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై నిరంతరం సమీక్షించుకుంటూ కొర త లేకుండా చూసుకోవాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది ఎప్పటికప్పుడు వార్డులను సందర్శించి, కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపాలన్నారు. కార్యక్రమంలో జేసీ నిశాంత్కుమార్, డీఎ్ఫఓ జగన్నాథ్ సింగ్, సర్వజన, సూపర్స్పెషాలిటీ, క్యాన్స ర్ ఆస్పత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, డ్రగ్స్ ఏడీ రమే్షరెడ్డి, ఏపీఎ్సఎం ఐడీసీ ఇంజనీర్లు, ఆర్డీఓ గుణభూషణ్రెడ్డి, డాక్టర్ నవీద్ పాల్గొన్నారు.