దూరవిద్యలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-06-18T06:34:22+05:30 IST

ఎస్కేయూ దూరవిద్య విభాగంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ వైస్‌చాన్సెలర్‌ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి గురువారం ఆదేశాలు జారీ చేశారు.

దూరవిద్యలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

అనంతపురం, జూన్‌17 : ఎస్కేయూ దూరవిద్య విభాగంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ వైస్‌చాన్సెలర్‌ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకే ఉద్యోగులకు మెమోలు అందించినా వారు ఇచ్చిన సంజాయిషీ సరిగ్గా లేదనే కారణంతో పుల్లారెడ్డి, నరేంద్ర, చంద్రశేఖర్‌ నాయుడు అనే ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. దీంతో వర్సిటీ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలే పరీక్షల విభాగంలో 15 మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయని తాము ఇటీవలే దూరవిద్య విభాగానికి బదిలీపై వచ్చామని అప్పటి ఉద్యో గులపై కూడా చర్యలు తీసుకుంటారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-06-18T06:34:22+05:30 IST