అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-14T06:50:46+05:30 IST

అప్పుల బాధ భరించలేక మండలంలోని మడేనహళ్లి గ్రామానికి చెందిన యువరైతు తూర్పింటి బసవరాజు (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

డీ హీరేహాళ్‌, ఏప్రిల్‌ 13: అప్పుల బాధ భరించలేక మండలంలోని మడేనహళ్లి గ్రామానికి చెందిన యువరైతు తూర్పింటి బసవరాజు (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మారెన్న, మారెక్క దంపతుల కు మారుడు బసవరాజు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఇతడికి సోమలింగమ్మతో పదేళ్లక్రితం వివాహమైంది. సంతానం కలగలేదు. తనకున్న ఐదెకరాల పొ లంలో వేరుశనగ, పత్తి పంటలు వేసి, మూడేళ్లుగా నష్టపోయాడు. పెట్టుబడులకు చేసిన అప్పులు రూ.8 లక్షలకు చేరాయి. వాటిని ఎలా తీర్చాలోనన్న మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. కాసేపటికి ఇంటికొచ్చిన తల్లి.. ఉరికి వేలాడుతున్న కొడుకును చూసి, కేకలు వేసింది. చుట్టుపక్కల వారి సాయంతో అతడిని కిందికి దింపి, బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బసవరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రైతు భార్య సోమలింగమ్మ ఫిర్యాదు మేరకు ఏఎ్‌సఐ రామ్మోహన్‌ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు.

Updated Date - 2021-04-14T06:50:46+05:30 IST