కర్నూలు జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-08-14T15:06:16+05:30 IST

నంద్యాల దేవనగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు జిల్లా: నంద్యాల దేవనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో మామను అల్లుడు హత్య చేశాడు. మామ, అల్లుడు ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో మామను హత్యచేశాడు. మామ మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని  అదుపులోకి తీసుకుని కేసు నమోదు ‌చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-08-14T15:06:16+05:30 IST