జార్ఖండులో దారుణం...వివాహితపై 17 మంది అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-12-10T14:38:58+05:30 IST

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వివాహిత మార్కెటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన....

జార్ఖండులో దారుణం...వివాహితపై 17 మంది అఘాయిత్యం

దుంకా(జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వివాహిత మార్కెటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని దుంకా జిల్లా ముఫాస్సిల్ ప్రాంతంలో జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది వ్యక్తులు వివాహితపై అత్యాచారం చేశారని బాధితురాలితోపాటు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, భర్త కలిసి సామూహిక అత్యాచార ఘటనపై ముఫాసిల్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. బాధిత వివాహితను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి, 17 మంది నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని దుంకా డీఐజీ సుదర్శన్ మండల్ చెప్పారు. 

Updated Date - 2020-12-10T14:38:58+05:30 IST