జగిత్యాల జిల్లాలో మరో దారుణం

ABN , First Publish Date - 2021-09-17T06:17:42+05:30 IST

హైద్రాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక అత్యాచార ఘటనను మరువక ముందే జగిత్యాల జిల్లాలో గురువారం మరో రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.

జగిత్యాల జిల్లాలో మరో దారుణం
వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల ఎస్పీ సింఽధుశర్మ

- ఇద్దరు బాలికలపై అత్యాచారం

- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

జగిత్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైద్రాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక అత్యాచార ఘటనను మరువక ముందే జగిత్యాల జిల్లాలో గురువారం మరో రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సింధూశర్మ వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఓ గ్రామంలో ఓ ఐదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువువుతున్న 18 సంవత్సరాల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని అరెస్టు చేసి పోక్సో ఆక్ట్‌- 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. స్వగ్రామంలో ఐదు సంవత్సరాల బాలిక ఈ నెల 15వ తేదీన మధ్యాహ్న సమయంలో తన ఇంటి ఎదుట ఆడుకుంటుంటుగా ఇంటి పక్కనే ఉంటున్న బాలికకు బంధువైన 18 సంవత్సరాల ఓ యువకుడు తన ఇంట్లోకి తీసుకవెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున బాలిక అనారోగ్యానికి గురికాగా ప్రశ్నించిన తల్లికి జరిగిన దారుణాన్ని బాలిక వివరించింది. దీంతో బాలిక తల్లి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో ఆక్ట్‌-2012 ప్రకారం 448, 376, ఏ, బీ సెక్షన్‌ల కింద నిందుతుడిపై కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసుల బృందం ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలోని సాంబశివుని గుట్టవద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించిన బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. 


గొల్లపల్లిలో దారుణం... ఆలస్యంగా వెలుగులోకి..


జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన  ఘటన మూడు రోజుల తర్వాత గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలికకు ప్రశాంత్‌ (24) అనే యువకుడు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి నమ్మించాడు.  తన సొంత ఇంట్లో ఒంటరిగా పనులు చేసుకుంటున్న బాలిక వద్దకు వచ్చిన ప్రశాంత్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలిక తల్లి విషయాన్ని గమనించి నిలదీసింది. సంఘటనపై సమా చారం అందించడంతో పోలీసులు నిందితుడు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌పై పోక్సో చట్టం-2012 ప్రకారం కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు ఘటనల్లో మైనర్‌ బాలికలపై అత్యాచార ఘటన చోటుచేసుకోవడం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-09-17T06:17:42+05:30 IST