అప్పు అడినందుకు దాడి

ABN , First Publish Date - 2021-05-17T05:36:01+05:30 IST

పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో ఆదివారం జయరా ములుపై హరి అనే వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు

అప్పు అడినందుకు దాడి

ధర్మవరంఅర్బన, మే 16: పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో ఆదివారం జయరా ములుపై హరి అనే వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు...మూడు నెలల క్రితం జయరాములు హరి అనే వ్యక్తికి రూ.250 అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బును ఇవ్వమని అడగడానికి హరి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి జయరాములుపై హరి దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



Updated Date - 2021-05-17T05:36:01+05:30 IST