బంగారు ఆభరణాల కోసం దాడి

ABN , First Publish Date - 2021-10-21T05:32:15+05:30 IST

బంగారు ఆభరణాల కోసం జరిగిన దాడిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన కిండాం అగ్రహారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

బంగారు ఆభరణాల కోసం దాడి

 వృద్ధురాలి మృతి

బొండపల్లి, అక్టోబరు 20: బంగారు ఆభరణాల కోసం జరిగిన దాడిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన కిండాం అగ్రహారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌ తెలిపిన వివరా లిలా ఉన్నాయి. కిండాం అగ్రహారానికి చెందిన ఇప్పర్తి సింహాచలం(70) భర్త కొంతకాలం కిందట మృతిచెందడంతో ఆమె ఒక్కరే గ్రామంలో జీవనం సాగిస్తు న్నారు. పాతదుప్పాడ గ్రామానికి చెందిన సమీప బంధువు సంతోష్‌కుమార్‌ ఎప్పటికప్పుడు ఆమె వద్దకు వచ్చి క్షేమ సమాచారం తెలుసుకుంటుంటారు. బుధ వారం మద్యం మత్తులో ఉన్న సంతోష్‌కుమార్‌ ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణం దోచుకొనేందుకు ప్రయత్నించగా పెనుగులాట చోటుచేసుకోవడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందినట్టు ఎస్‌ఐ  తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

 

Updated Date - 2021-10-21T05:32:15+05:30 IST