HYD: మద్యం మత్తులో బార్‌ సిబ్బందిపై దాడి

ABN , First Publish Date - 2021-10-14T15:44:33+05:30 IST

తాగిన మైకంలో యువకులు బార్‌లో పనిచేసే సిబ్బందితో పాటు యజమానిపై దాడి చేశారు. ఈ ఘటన హైదర్‌గూడ బాపూఘాట్‌ బ్రిడ్జి సమీపంలోని భవానీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో

HYD: మద్యం మత్తులో బార్‌ సిబ్బందిపై దాడి

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: తాగిన మైకంలో యువకులు బార్‌లో పనిచేసే సిబ్బందితో పాటు యజమానిపై దాడి చేశారు. ఈ ఘటన హైదర్‌గూడ బాపూఘాట్‌ బ్రిడ్జి సమీపంలోని భవానీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి జరిగింది. లంగర్‌హౌజ్‌కు చెందిన పదిమంది యువకులు భవానీ రెస్టారెంట్‌లో మద్యం తాగారు. బిల్‌ కట్టమంటే కార్డు చూపి తాము డీసీపీ, ఏసీపీల మనుషులమని చెప్పారు. వెయిటర్‌ రామకృష్ణ డెబిట్‌ కార్డు అనుకుని స్వైప్‌ చేయగా డబ్బులు రాలేదని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న రాజు, అతడి మిత్రులు బాటిల్‌తో వెయిటర్‌పై దాడి చేయగా తలకు గాయాలయ్యాయి. బార్‌ యజమానిపై కూడా దాడి చేసి పారిపోసాగారు. బార్‌ యాజమాన్యం, సిబ్బంది రాజేంద్రనగ ర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దాడికి పాల్పడిన  రాజును అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-14T15:44:33+05:30 IST