పథకం ప్రకారమే బారిపై దాడి

ABN , First Publish Date - 2020-07-10T07:51:42+05:30 IST

కశ్మీర్‌లోని బండీపొరా జిల్లా బీజేపీ అధ్యక్షుడు వసీమ్‌ బారి, ఆయన తండ్రి బషీర్‌, సోదరుడు ఉమర్‌ బషీర్‌పై పథకం ప్రకారమే ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్యచేశారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు...

పథకం ప్రకారమే బారిపై దాడి

  • విధుల నుంచి భద్రతా సిబ్బంది తొలగింపు: ఐజీ


శ్రీనగర్‌, జూలై 9: కశ్మీర్‌లోని బండీపొరా జిల్లా బీజేపీ అధ్యక్షుడు వసీమ్‌ బారి, ఆయన తండ్రి బషీర్‌, సోదరుడు ఉమర్‌ బషీర్‌పై పథకం ప్రకారమే ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్యచేశారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. ఘటనకు సంబంధించి బారి భద్రతా సిబ్బంది పది మందిని అరెస్టు చేశామని, వారిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. 


Updated Date - 2020-07-10T07:51:42+05:30 IST