ఓటమి భయంతో చంద్రబాబుపై వైసీపీ దాడి
ABN , First Publish Date - 2021-04-14T04:36:29+05:30 IST
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గాలి వీస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు భరత్ అన్నారు.
టీడీపీ నేతలు ఉమా, aభరత్
డక్కిలి, ఏప్రిల్ 13 : తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గాలి వీస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు భరత్ అన్నారు. డక్కిలిలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పలుగ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ విసిరిన సవాల్కు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతో ముఖ్యమంత్రి జగన్ కొవిడ్ సాకుతో తిరుపతి పర్యటనను రద్దుచేసుకున్నారన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభల్లో రాళ్లదాడికి దిగిందని ఆరోపించారు. ఈ ఎన్నికోల్లో ఇష్టారాజ్యంగా డబ్బును పంచేందుకు వైసీపీ నేతలు రంగం సిద్ధం చేశారని ఉమా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తారన్నారు. వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే సంఖ్య పెరుగుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదన్నారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. తొలుత కమ్మపల్లి, దుఏవుడువెల్లంపల్లి, పాతనాలపాడు గ్రామాల్లో ఆ ప్రాంత వాసులు భరత్కు బ్రహ్మరథం పట్టారు. భరత్ను చూసేందుకు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగోటి నాగేశ్వరావు, మాజీ జడీ ్పటీసీ సభ్యులు ఏలేవ్వరం రామచంద్రయ్య నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, పీపీ చౌదిరి, నర్రావుల రమేష్, ఆలూరు పాపానాయుడు, పోట్టా మునెయ్య, నల్లాని రామచంద్రయ్య, రాంబాబు, కురుగొండ్ల శ్రీనివాసులు నాయుడు తదితరులు ఉన్నారు.