దళిత వైద్యుడుపై దాడి జగన్ పాలనకు పరాకాష్ట
ABN , First Publish Date - 2020-05-18T10:26:10+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో ప్రజారో గ్యాన్ని కాపాడటానికి నిరంతరం సేవలందిస్తున్న వైద్యులకు ప్రజలు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల విమర్శ
ఒంగోలు (కార్పొరేషన్) మే 17 : కరోనా వైరస్ నియంత్రణలో ప్రజారో గ్యాన్ని కాపాడటానికి నిరంతరం సేవలందిస్తున్న వైద్యులకు ప్రజలు బ్ర హ్మరథం పడుతుంటే వైసీపీ ప్రభుత్వం వైద్యులకు కనీస సౌకర్యాలు స మకూర్చడంలో విఫలమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామ చర్ల జనార్దన్ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. అంతేగాకుండా దళి త వైద్యుడుపై దాడి, అక్రమ కేసులు బనాయించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫాసిస్ట్ పాలనకు పరాకాష్టగా ఉందని ఆరోపించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న మత్తు డాక్టర్ ఎస్.సుధాకర్ తమ ఇబ్బందులను మీడియాకు చెప్పినందుకు తొలగించడం అన్యాయమ న్నారు. సుధాకర్ను వేధింపులకు గురిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేవారు. టీడీపీ తరుపున జాతీయ ఎ స్సీ,ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు దామచర్ల తెలిపారు.