ఆటోలో ప్రయాణికుడిపై దాడి

ABN , First Publish Date - 2020-03-17T16:13:28+05:30 IST

గుంటూరు: తాడేపల్లి వారధి వద్ద దారి దోపిడి జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిపై పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు.

ఆటోలో ప్రయాణికుడిపై దాడి

గుంటూరు: తాడేపల్లి వారధి వద్ద దారి దోపిడి జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిపై పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. సెల్ ఫోన్, నగదు లాక్కోని ఆటో నుంచి కిందకు తోసివేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి స్టేషన్‌కు వెళ్తే తమ పరిధి కాదని.. తాడేపల్లిలో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం.



Updated Date - 2020-03-17T16:13:28+05:30 IST